పాము కాటు వేసేముందు మిమ్మల్ని హెచ్చరిస్తుందా?
ఆ హెచ్చరికను మనం అర్థం చేసుకుంటే, పాము కాటు నుంచి తప్పించుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు.
“మనం పాములను చూసి భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పాములకే మనం అంటే భయం అన్నారు” స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేదీ.
గుజరాత్ కు చెందిన ధర్మేంద్ర త్రివేదీ 38 ఏళ్లుగా జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని, సురక్షితంగా వాటిని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టే బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. పాముల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
పాముల ప్రవర్తన గురించి తెలుసుకుంటే, దాని కాటుకు గురయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని ఆయన అన్నారు.
“విషం అనేది పాములకు వేటాడే ఆయుధం. దీని ద్వారానే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోవడానికి దారేదీ కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటు వేస్తుంది. పాము ఎదురైనప్పుడు ఏ మాత్రం భయం లేకుండా కదలకుండా ఉండిపోతే, అదే మీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది” అని అన్నారు.
భారతదేశంలో పాముకాటు ప్రమాదాలు వర్షాకాలంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సమయానికి చికిత్స అందకపోతే మరణం సంభవించే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది.
కాటు వేసే ముందు పాము హెచ్చరిస్తుందా?
పాము కాటు వేసిన తరువాత శరీరంలో ఏం జరుగుతుంది?
పాము కాటేస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
ఏం చేయాలి?
ఏం చేయకూడదు?
సమయానికి చికిత్స అందటం ముఖ్యం...
పాము కాటుకు గురవ్వకుండా ఉండాలంటే...
దేశంలో పాము కాటు ప్రమాదాలు...
ముంబైకు చెందిన ప్రియాంక కదం పాము కాటు ప్రమాదాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఈమె స్నేక్ బైట్ హీలింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇండియా (SHE India) ఫౌండింగ్ మెంబర్ గా కొనసాగుతున్నారు.
ఆమె మాట్లాడుతూ “పాము కాటుకు గురైన వ్యక్తికి వెంటనే చికిత్స అందించాలి. ప్రతి క్షణమూ విలువైనదే. దురదృష్టవశాత్తూ మన దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, మందులు అందుబాటులో లేవు. ఈ కారణంగా అక్కడి సిబ్బంది బాధితులను జిల్లా ఆసుపత్రులకు తీసుకువెళ్లమని సూచిస్తారు. దూరాన ఉన్న ఆసుపత్రికి చేరుకునే సమయానికి పరిస్థితి విషమించి, వైకల్యం లేదా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి” అని అన్నారు.
“జాతీయ ఆరోగ్య పథకంలో పాముకాటుకు ఇచ్చే చికిత్సను కూడా చేర్చాలి. దీని వలన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తగనన్ని నిధులు అందుతాయి. ఆసుపత్రుల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి, వారికి వేతనం కల్పించాలి. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పాము కాటు పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వలనప్రజల్లో పాముల పట్ల ఉన్న మూఢనమ్మకాలు తొలగి, పాము కాటుకు గురైన సందర్భంలో చికిత్స తీసుకోవాలనే స్పృహ పెరుగుతుంది” అని అన్నారు.