Memo: రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలుపై పలు అంశాలను లేవనెత్తుతూ విలేకరుల సమావేశం నిర్వహించిన ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఛైర్మన్ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరికి పాఠశాల విద్య సంచాలకుడు చినవీరభద్రుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలకు సంబంధిత విభాగానికి సిఫార్సు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం బడిమానేసే పిల్లల సంఖ్య పెరుగుతుందని, ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తగ్గుతుందని పేర్కొంటూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులను ఆందోళన పరిచేలా ప్రకటన ఇచ్చారని వెల్లడించారు.
Memo: ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు
June 17, 2021
0
Tags