ముఖ్యంగా టెక్నాలజీల్లో ప్రస్తుతం ఏఐ హవా నడుస్తుంది. అయితే మోసగాళ్లు ఏఐను ఉపయోగించుకుని మరీ మోసాలకు తెర తీశారు. ఏఐ వాయిస్ స్కామ్లో ఇటీవల కాలంలో చాలా మంది మోసంపోతున్నారు. 59 ఏళ్ల మహిళ ఇటీవల ఏఐ ద్వారా రూపొందించిన వాయిస్ స్కామ్కు గురై రూ. 1.4 లక్షలను కోల్పోయింది.
కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుల పేర్లతో
స్కామర్ సమస్యలో ఉన్న బంధువుగా నటిస్తూ అత్యవసరంగా డబ్బు కోసం అడుగుతాడు. స్కామ్ను మరింత నమ్మదగినదిగా చేయడానికి తెలిసిన పేర్లను ఉపయోగిస్తాడు.
కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు
స్కామర్లు తమ వ్యక్తిగత సమాచారం లేదా చెల్లింపుల కోసం అడిగే బ్యాంక్ వంటి బాధితుడు డీల్ చేసే కంపెనీకి చెందినవారని క్లెయిమ్ చేస్తారు.
ప్రభుత్వ అధికారిలా..
స్కామర్లు ఐఆర్ఎస్ వంటి ఏజెన్సీల ఫోన్ చేసినట్లు బాధితులకు చెబుతారు. బాధితుడు వారిని నమ్మకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తారు.
రక్షణ మార్గాలివే
- ఎవరైనా అత్యవసరంగా డబ్బు లేదా వ్యక్తిగత వివరాలు అడిగితే జాగ్రత్తగా ఉండాలి. అనుమానం ఉంటే ఫోన్ ముగించి, కంపెనీకి నేరుగా కాల్ చేయండి.
- స్కామర్లు క్రమం తప్పకుండా తమ పద్ధతులను మార్చుకుంటున్నందున తాజా స్కామ్ వ్యూహాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
- ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే అధికారులకు తెలియజేయాలి