డెల్టా ప్రభావంతో వణికిపోతోన్న ప్రపంచ దేశాలను కొత్త రూపంలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి కలవరపెడుతోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్ ప్రభావంతో కేసులు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
- దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసిన ఒమిక్రాన్.
- ప్రాథమిక నివేదికల అధ్యయనం చేసిన సింగ్పూర్.
- భారీగా నమోదవుతున్న వేరియంట్ కేసులు.
అంటే, గతంలో కోవిడ్-19 బారినపడ్డవారు సైతం ఒమిక్రాన్ వల్ల మరోసారి ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. సింగ్పూర్లో ఆదివారం మరొ ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయ్యింది. డిసెంబరు 1న దక్షిణాఫ్రికా నుంచి విమానంలో వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అదే విమానంలో ఈ 37 ఏళ్ల వ్యక్తి కూడా వచ్చినట్టు అధికారులు తెలిపారు. అతడు రెండు డోస్ల టీకా తీసుకున్నాడని పేర్కొన్నారు. మరోవైపు, ఆదివారం సింగ్పూర్లో కొత్తగా 552 కేసులు నిర్ధారణ కాగా.. 13 మంది చనిపోయారు.
ఒమిక్రాన్ విషయంలో గత కొద్ది రోజుల నుంచి దక్షిణాఫ్రికా, ఇతర దేశాల నుంచి, నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించి సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. ‘ఈ ప్రకటన Omicron వేరియంట్పై అవగాహనను మరింత పెంచింది.. అయితే చాలా ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు’ అని మంత్రిత్వ శాఖ వ్యాఖ్యలను స్థానిక మీడియా కోట్ చేసింది.
ఈ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచెందుతోందని, మన సరిహద్దుల్లో మరిన్ని కేసులు బయటపడతాయనే అనుమానం వ్యక్తం చేసింది. ‘కొత్త వేరియంట్పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు పనిచేస్తాయా? అనే అంశంపై అధ్యయనం కొనసాగుతోంది.. కానీ, పలువురు పరిశోధకులు మాత్రం ఒమిక్రాన్పై కూడా పనిచేస్తాయని, ముఖ్యంగా వైరస్ తీవ్రం కాకుండా అడ్డుకుంటాయని అంచనా వేస్తున్నారు’ అని తెలిపింది. కాబట్టి ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకోనివారు టీకా తీసుకోవాలని, బూస్టర్ డోస్లకు ముందుకురావాలని అభ్యర్ధించింది.