Trending

6/trending/recent

CM Jagan Review : ఆరోగ్యశాఖ పై ముఖ్యమంత్రి సమీక్ష .. కీలక నిర్ణయాలు..

CM Jagan Review : రాష్ట్రంలో కోవిడ్‌గ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను అధికారులు వివరించారు. 

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. రెండో వేవ్‌తో పోల్చిచూస్తే.. ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామని అధికారులు పేర్కొన్నారు. 

అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్‌ కేసుల్లో ఆస్పత్రుల్లో దాదాపు 27వేల యాక్టివ్‌ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారని వివరించారు. 

ఇందులో ఆక్సిజన్‌ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనని అధికారులు తెలిపారు.

CM Jagan Review

ఈమేరకు వైద్య పరంగా అవసరాలను గుర్తించాలని.. ఆ మేరకు ఆక్సిజన్‌ను, మందులను సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలంటే కనీసం 14 రోజులు ఉండేదని, ఇప్పుడు వారం రోజులకు ముందే డిశ్చార్జి అవుతున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను గుర్తించామని.. సుమారు 28 వేల బెడ్లను సిద్ధంచేశామని అధికారులు తెలిపారు.

104 కాల్‌సెంటర్‌పైనా సీఎం సమీక్ష

►కాల్‌సెంటర్‌ పటిష్టంగా పనిచేయాలని అదేశం

►టెలిమెడిసిన్‌ ద్వారా కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

►ప్రికాషన డోస్‌ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం

►ఈ వ్యవధిని 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం

►దీనివల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్నావారికి ఉపయోగమని సమావేశంలో అభిప్రాయం

►అంతేకాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందన్న సమావేశంలో నిర్ణయం

►రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

►తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం.

►15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు

►మరో 5 జిల్లాల్లో 90శాతానికిపైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్‌ పూర్తి. మరో నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్‌

►మిగిలిన జిల్లాల్లోనూ ఉద్ధృతంగా వ్యాక్సినేషన్‌ చేయాలని సీఎం ఆదేశం

►మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.

పాఠశాలలకు శలవులు ఇవ్వబోము... - విద్యా శాఖ మంత్రి

స్కూళ్లకు సెలవులు పొడిగించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీచర్లకు 100శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. 15-18 వయస్సు వారికి 95శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.10, ఇంటర్ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తాం అని గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ పునరుద్ఘాంటించారు. 

అమెరికాలో లక్షలాది కరోనా కేసులు వస్తున్నా స్కూళ్లు మూసివేయలేదు 

ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవుల పై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. సోమవారం (జనవరి 17) నుంచి యథావిధిగా విద్యా సంస్థలు పని చేస్తాయని మంత్రి స్పష్టం చేశారు.

CM Jagan Review : ఆరోగ్యశాఖ పై ముఖ్యమంత్రి సమీక్ష .. కీలక నిర్ణయాలు..


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad