Visakhapatnam:విరిగిన బల్లలు, కూలిన ప్రహరీ.. విశాఖలో ముందుకు వచ్చిన సముద్రం..!

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Visakhapatnam ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకు వచ్చింది. ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పర్యాటకులకు అధికారులు అనుమతి నిషేధించారు.

  • ఆర్కే బీచ్ వద్ద 200 మీటర్లు కోతకు గురైన భూమి 
  • చిల్డ్రన్‌పార్కులో కూలిన ప్రహరీ
  • పర్యాటకులకు నో పర్మిషన్
ఉత్తరాంధ్రను కలవర పెట్టిన జవాద్ తుఫాన్ దిశ మార్చుకుని ఒడిశా తీరం వైపు మళ్లిన విషయం తెలిసిందే. అయితే తుఫాన్ ప్రభావం వలన ఏర్పడిన వాయుగుండంతో విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌ వద్ద సముద్రం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. పర్యాటకులకు బీచ్‌లో అనుమతి నిషేధించారు.

ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర కోతకు భూమి కోతకు గురైంది. చిల్డ్రన్‌పార్కులో కూలిపోయిన ప్రహరీ కూలిపోయింది. బల్లలు కూడా విరిగిపోయాయి. దీంతో సందర్శకులు బీచ్‌లోకి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జవాద్‌ తుఫాన్ నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. జవాన్ తుఫాన్ ఒడిశావైపు మళ్లింది. తుఫాన్ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Visakhapatnam:విరిగిన బల్లలు, కూలిన ప్రహరీ.. విశాఖలో ముందుకు వచ్చిన సముద్రం..!


Below Post Ad


Post a Comment

0 Comments