Trending

6/trending/recent

Delhi:రేపటి నుంచి స్కూళ్లు బంద్‌.. ఎక్కడ, ఎందుకో తెలుసా..?

Delhi air pollution: వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను మూసివేయనున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను మూసివేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖామంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. అయితే.. ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతాయని స్పష్టం చేశారు.

అలాగే.. పరీక్షలు సైతం యథావిథిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో పాఠశాలలను ఏ విధంగా తెరుస్తారని ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలను మూసివేసి.. ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం మొగ్గుచూపింది.

ఇప్పటికే ఇది రెండో సారి:

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటడంతో ఆప్‌ ప్రభుత్వం న‌వంబ‌ర్ 13వ తేదీన‌ కీలక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. న‌వంబ‌ర్ 15వ తేదీ నుంచి దేశ రాజధానిలో వారం రోజులపాటు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

పిల్లలు కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియా సమావేశంలో తెలిపారు.

ఉద్యోగుల‌కు వర్క్‌ ఫ్రం హోం:

ఇక.. ప్రభుత్వ అధికారులందరూ వారం రోజులు ఇంటి నుంచే ఆఫీసు పనులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే వీలైనంత వరకు ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు.

Delhi:రేపటి నుంచి స్కూళ్లు బంద్‌.. ఎక్కడ, ఎందుకో తెలుసా..?


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad