రోశయ్యకు పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటించారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటూ ప్రముఖులు నివాళులు అర్పించారు. జగన్ హైదరాబాద్ రాకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ.
- కేసీఆర్ వెళ్లినా.. జగన్ ఎందుకు రాలేదని చర్చ
- సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది
- జగన్ హైదరాబాద్ ఎందుకు వెళ్లలేదన్న శిరీష
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం తీరని విషాదాన్ని నింపింది. సీనియర్ రాజకీయ నేతగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. రోశయ్యకు పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటించారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటూ ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చి రోశయ్యకు నివాళులు అర్పించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
టీడీపీ నేత గౌతు శిరీష సీఎం జగన్ తీరును తప్పుబట్టారు. ‘తెలుగు రాష్ట్ర రాజకీయాలలోనే కాదు దాదాపు దేశ రాజకీయాల్లో కూడా ఎలాంటి వారైనా అధికార , ప్రతిపక్ష నాయకులలో ఎవరు మరణించినా మర్యాదపూర్వకంగా పరమార్శించడం ఒక గౌరవంగా ఇప్పటి వరకు అన్ని పార్టీల నాయకులూ పాటిస్తున్నారు , ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి , అజాతశత్రువు , ఒకప్పుడు తన తండ్రికి ఎంతో ఆప్తులు అయినా రోశయ్యగారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న వ్యక్తి కనీసం మర్యాద పాటించకపోవడం అత్యంత హేయమైన చర్య , ఇలాంటి కక్షా స్వభావం ఉన్న వారా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్ ని ముందుకు తీసుకువెళతారు అని ఇంకా ఎవ్వరైనా వాదిస్తే వారికి ఒక నమస్కారం, సరే మిగతా సీనియర్ నాయకులకు ఏమైంది , ఈ రోజు వైస్సార్సీపీ లోపదవులు అనుభవిస్తున్న సీనియర్ నాయకులూ రోశయ్య గారి మంత్రి వర్గంలో కూడా పనిచేశారు , కనీసం వారు కూడా మర్యాద పాటించలేదే , ఎక్కడ మంత్రి పదవులు పోతాయేమో , వచ్చేవి రావేమో అని కక్కుర్తి , వీళ్ళొక నాయకులూ , వీరికి పదవులు’అంటూ పోస్ట్ పెట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం తీరని విషాదాన్ని నింపింది. సీనియర్ రాజకీయ నేతగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. రోశయ్యకు పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటించారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటూ ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చి రోశయ్యకు నివాళులు అర్పించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
టీడీపీ నేత గౌతు శిరీష సీఎం జగన్ తీరును తప్పుబట్టారు. ‘తెలుగు రాష్ట్ర రాజకీయాలలోనే కాదు దాదాపు దేశ రాజకీయాల్లో కూడా ఎలాంటి వారైనా అధికార , ప్రతిపక్ష నాయకులలో ఎవరు మరణించినా మర్యాదపూర్వకంగా పరమార్శించడం ఒక గౌరవంగా ఇప్పటి వరకు అన్ని పార్టీల నాయకులూ పాటిస్తున్నారు , ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి , అజాతశత్రువు , ఒకప్పుడు తన తండ్రికి ఎంతో ఆప్తులు అయినా రోశయ్యగారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న వ్యక్తి కనీసం మర్యాద పాటించకపోవడం అత్యంత హేయమైన చర్య , ఇలాంటి కక్షా స్వభావం ఉన్న వారా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్ ని ముందుకు తీసుకువెళతారు అని ఇంకా ఎవ్వరైనా వాదిస్తే వారికి ఒక నమస్కారం, సరే మిగతా సీనియర్ నాయకులకు ఏమైంది , ఈ రోజు వైస్సార్సీపీ లోపదవులు అనుభవిస్తున్న సీనియర్ నాయకులూ రోశయ్య గారి మంత్రి వర్గంలో కూడా పనిచేశారు , కనీసం వారు కూడా మర్యాద పాటించలేదే , ఎక్కడ మంత్రి పదవులు పోతాయేమో , వచ్చేవి రావేమో అని కక్కుర్తి , వీళ్ళొక నాయకులూ , వీరికి పదవులు’అంటూ పోస్ట్ పెట్టారు.