Timings Change: ఉద్యోగుల పని వేళలు మార్పు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • జూన్ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు...

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు జూన్ 10 నుంచి మారబోతున్నాయి. కర్ఫ్యూ సమయాల్లో మార్పు కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వద్ద సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ఫ్యూ సమయాలు మార్చాలని నిర్ణయించారు. కరోనా కేసుల్లో కొంత తగ్గుదల ఉండటంతో జూన్ 10 నుంచి తదుపరి నిర్ణయం తీసుకునే వరకు సడలింపు వేళలు మార్చారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. అది జూన్ 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీసు వేళలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారు డ్యూటీలు చేయవలసి ఉంటుంది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఇవే వేళలు అమల్లో ఉంటాయి.



Below Post Ad


Post a Comment

0 Comments