Aadhaar is No Longer Mandatory: పింఛన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు పెన్షనర్లకు ఇక ఆధార్కార్డు తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. లబ్ధిదారులు తమ పెన్షన్ పొందేందుకు జీవన్ ప్రమాణ్ డిజిటల్ సర్టిఫికెట్ను కేంద్రం ఇటీవల తప్పనిసరి చేసింది. అయితే, ఆధార్ అథెంటికేషన్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు పెన్షనర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో తాజాగా మరో ప్రకటన చేసింది.
మార్చి 18 న ఎలక్ట్రానిక్స్తోపాటు ఐటి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ సందర్భంలో, ఎన్ఐసి ఆధార్ లా 2016, ఆధార్ రెగ్యులేషన్ 2016, ఆఫీస్ మెమోరాండం, యుఐడిఎఐ జారీ చేసిన సర్క్యులర్లతోపాటు మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించాల్సి ఉంటుంది.