ఆర్జీయూకేటీ సెట్‌కు 96 శాతం హాజరు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

న్యూస్ టోన్, అమరావతి, నూజివీడు: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఆర్జీయూకేటీ-సెట్‌)కు 96శాతం మంది హాజరయ్యారు. 88,972 మంది దరఖాస్తు చేసుకోగా.. 85,760 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 97.61 శాతం మంది హాజరయ్యారు. తెలంగాణలోని కేంద్రాల్లో.. ఖమ్మంలో 95శాతం, నిజామాబాద్‌లో 86.6 శాతం మంది పరీక్ష రాశారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలుంటే 7వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు ఆధారాలతోసహా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఉపకులపతి హేమచంద్రారెడ్డి సూచించారు.

RGUKT CET 96 ATTENDANCE

Below Post Ad


Post a Comment

0 Comments